యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఆర్ధిక సాయమందించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం మర్లపాలెం గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్ అయ్యి బాధ పడుతున్న పితాని శ్రీనివాస్ కి శెట్టిబలిజ సంఘ సభ్యులు మరియు పితాని బాలకృష్ణ ఏర్పాటు చేసిన 30,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినారు. వీరి వెంట సానబోయిన మల్లికార్జునరావు, జక్కంశెట్టి పండు సానబోయిన వీరభద్రరావు, దంగేటి శీను, యల్లమెల్లి లోకేష్, సానబోయిన నాగేంద్ర మరియు మట్టపర్తి దుర్గాప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.