చింతలపూడి మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

చింతలపూడి మండల అధ్యక్షుడు చీదరాల మధుబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం చింతలపూడి నియోజకవర్గం లో జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి వివిధ పార్టీల కార్యకర్తలు 50మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకా ఈశ్వరయ్య, పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గురుజు ఉమా మహేశ్వరి, సంయుక్త కార్యదర్శి తూము విజయకుమార్ హాజరయ్యారు.