జనశ్రేణులకు అందుబాటులోకి వచ్చిన జనసేన పార్టీ కార్యాలయం

  • అంగరంగ వైభవంగా కార్యక్రమం..
  • కార్యక్రమానికి పోటెత్తిన జనశ్రేణులు..
  • ఇక కోరుకొండ మండల పార్టీ కార్యక్రమాలు అన్నీ ఇక్కడ నుండే..

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ కాపవరం జంక్షన్లో జనసేన నూతన పార్టీ కార్యాలయం గురువారం నుండి జనశ్రేణులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.. కొన్ని రోజుల క్రితం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన ఈ కార్యాలయాన్ని.. నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అధునాతన హంగులతో నిర్మించిన ఈ కార్యాలయాన్ని వీరమహిళలు, జనసేన పార్టీ పెద్దలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. అనంతరం దేవుని చిత్రపటాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. పార్టీ పెద్దలు అడ్డాల శివ చక్రవర్తి, వీర మహిళ సత్యవతి, అడబాల ఆదివిష్ణు, అడ్డాల శ్రీను లాంటి పార్టీ పెద్దలచే కార్యాలయంలో పలు విభాగాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా “బత్తుల” దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుండి కోరుకొండ మండల పరిధిలోనే కార్యక్రమాలన్నీ ఈ కార్యాలయం నుంచే జరుగుతాయని, జనసైనికులకు ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఏ బెదిరింపులు వచ్చినా.. అందరికంటే తాను ముందు ఉంటానని.. ఎవరికి భయపడాల్సిన పనిలేదని, జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాబోవు రోజుల్లో మరింత ఉదృతం చేసి, రాబోవు ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా మరింత శ్రమిస్తామని ఈ సందర్భంగా అన్నారు.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, వందలాది జనసైనికులు, పెద్దఎత్తున వీరమహిళలు పాల్గొని కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారు.