జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ: రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు: టీం పిడికిలి స్ఫూర్తితో ఎమ్మిగనూర్ జనసేన నాయకులు రాహుల్ సాగర్ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను బుధవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌలు రైతులకు కొండంత భరోసా ఇచ్చిన ఘనత జనసేనాని పవన్ కళ్యాణ్ గారిదని.. ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా.. రైతుల పక్షాన నిలబడి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకొని అధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బజారి, మంజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.