జనసేన పార్టీ గెలుపుకు కృషి చేయాలి

  • జాగరపు కళ్యాణ్ కుమార్

అరకు నియోజవర్గం: పెదబయలు మండలం, జోడమామిడి గ్రామంలో మంగళవారం జాగరపు కళ్యాణ్ కుమార్ జనసైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కుమార్ జనసైనికులతో మాట్లాడుతూ.. పార్టీ కోసం అందరం కలిసి పని చేయాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజలు దగ్గరకు తీసుకెళ్ళాలని, జనసేన పార్టీ గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ జనసేన గుర్తిస్తుందని, జనసేన యువ నాయకులకు జనసేన పార్టీ యువ నాయకుడు జాగరపు కళ్యాణ్ కుమార్ తెలియపరచటం జరిగింది.