జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన పార్టీ సభ్యుల అందరూ కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ప్రకారంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని చర్చించుకోవడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు కలిసికట్టుగా భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు వచ్చి జరుపుకోవాలని చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో గ్రామాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిపట్ల సంబంధిత అధికారులకు తెలియజేసి వాటి యొక్క పరిష్కారం అయ్యేలాగున పోరాడాలని పోరాడాలని చర్చించుకోవడం జరిగింది. జనసేన పార్టీ కొరకు సమయాన్ని వెచ్చిస్తూ, డబ్బులు వెచ్చిస్తూ, ధైర్యాన్ని ఇస్తూ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలని చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్లమల రవికుమార్, మద్దిలేటి, జనసేన ప్రవీణ్ మరియు కార్యకర్తలు హాజరు కావడం జరిగింది.