కె.కోటపాడులో జనసేన మండల స్థాయి సమావేశం

మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడు మండలంలో, జనసేన మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మండలంలో ఉన్న సుమారుగా 15 పంచాయతీల నుంచి జనసేన నాయకులు, జనసైనికులు, హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు మాట్లాడుతూ మనమంతా కలిసి మన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న మాకు శిరోధార్యమే, అని చేసే విధంగా మనమంతా కలిసి పని చేస్తామని పార్టీని బలోపేతం చేసే దిశగా పంచాయతీలో పార్టీని బలోపేతం చేసే దిశగా పంచాయతీ, పంచాయతీకి తిరిగి మన పార్టీ సిద్ధాంతాల్ని తెలియపరుస్తామని, అర్థమయ్యేటట్టుగా చెప్తామని పంచాయతీల్లో తిరిగి మన పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసే విధంగా మనమంతా సిద్ధమవ్వాలని చెప్పారు.