పైరెడ్డిపాలెం గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది

  • పొన్నలూరు విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు
  • 15 రోజుల్లో కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తానని ఏఈ రమేష్ బాబు హామీ

కొండెపి నియోజకవర్గం: ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, పైరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం జనసేన మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ బృందం పర్యటించి ప్రజా సమస్య తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా పైరెడ్డిపాలెం గ్రామంలో నల్లగంగు వెంకటేశ్వర్ రెడ్డి ఇంటి వద్ద విద్యుత్ స్తంభం పాతది అయిఉండటం వలన, విపరీతమైన గాలులు మరియు వర్షాలు పడితే కచ్చితంగా విద్యుత్ స్తంభం పడిపోయి ప్రజలకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, ఆ పాత విద్యుత్ స్తంభాన్ని తీసివేసి దాని ప్లేస్ లో మరో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని పొన్నలూరు విద్యుత్ అధికారి (ఏఈ) రమేష్ బాబుకి బుధవారం జనసేన పార్టీ నుండి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, 15 రోజుల్లో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తానని ఏఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దొరడ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, కర్ణ తిరుమలరెడ్డి, ఖాదర్ బాషా, మహబూబ్ బాషా, శ్రీను, సాయి, భార్గవ్, పీటర్, రవి, మధు రెడ్డి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.