కంబాలపాడు బ్రిడ్జి నిర్మాణం కోసం జనసేన పార్టీ పోరాటం

కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండల పరిధిలోని కంబాలపాడు నుండి కోయిలకొండకు వెళ్లే మార్గంలో పడిపోయిన బ్రిడ్జిని తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని క్రిష్ణగిరి మండలం ఎంపీడీవో కి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ నాయకులు బోయ గోవిందు మాట్లాడుతూ కమలపాడు నుండి కోయిలకొండకు వెళ్లే మార్గంలో బ్రిడ్జ్ పడిపోయి 2 సంవత్సరాలులు గడుస్తున్నా తాత్కాలిక మరమ్మతులకు కూడా నోచుకోలేదు. రైతులకు అలాగే ఇతర గ్రామాలకు వెళ్లే వాహనదారులకు అక్కడ రాకపోకలు ప్రయాణం చేసేవారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కృష్ణగిరి, కంబాలపాడు గురుకుల పాఠశాలకు, కస్తూరిబా పాఠశాలకు హాస్టళ్లకు, వెళ్లి విద్యార్థులకు, హాస్పటల్ కు అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలన్న కొన్ని గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే వెళ్ళాలి. ఇతర గ్రామాల నుండి వచ్చే వారు అసౌకర్యంతో చాలా ఇబ్బంది పడుతున్నారు . ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని అక్కడ పడిపోయిన బ్రిడ్జిని నిర్మించాలని ప్రజాశ్రేయస్సుకు పాటుపడాలి అని జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నామని… దయచేసి ఆ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని అలా చేయని పక్షంలో ఈ సమస్యను పరిష్కరించే వరకు జనసేన పార్టీ తరపున ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు.