గెద్దాడలో జనసేన పార్టీ గ్రామకమిటీల సమావేశం

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రామకమిటీల సమావేశాన్ని, మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గాల, జనసైనికులు, మండలాల అధ్యక్షులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. పలువురు యువత జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. గ్రామాలలో గ్రామకమిటీల ద్వారా పార్టీని బలోపేతం చేసి 2024 లో పవన్ కళ్యాణ్ ని సిఎం చేసే విధంగా కృషి చేస్తామని. ఈనెల 20 తేదీన నరసాపురంలో జరగనున్న పవన్ కళ్యాణ్ సమావేశాన్ని కూడా విజయవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.