రెండు కుటుంబాలకు అండగా నిలిచిన జనసేన

అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం, గంగినేపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త బోయ వినోద్, వైసీపీ కార్యకర్త మరియు గ్రామ సచివాలయ వాలంటీర్ నాగార్జున. ఇద్దరూ 13-జనవరి-2023 వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా చూసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో నాగార్జున అనే వ్యక్తి మరణించగా వినోద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. జనసేన పార్టీ చెన్నేకొత్తపల్లి మండల అధ్యక్షులు ఇటికోటి క్రాంతి కుమార్, జనసేన పార్టీ కార్యకర్త వినోద్ కు రూపాయలు 7000/- మరియు వైసీపీ కార్యకర్త నాగార్జున కుటుంబ సభ్యులకు రూపాయలు 5000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే వారికి ఎల్లవేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ద్విచక్రవాహనంలో వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు చిట్ర రమేష్, లోకేష్ రెడ్డి, రాజశేఖర్, సాకే నాగరాజు, కొక్కంటి పవన్ కుమార్, పండ్ల నారాయణ, విజయ్ కుమార్, జయసింహ తదితరులు పాల్గొన్నారు.