అనాధశ్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

  • అనాధశ్రమంలోని పిల్లలతో జనసేనాని పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రామభద్రపురం మండల జనసైనికులు

బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలం లచ్చయ్యపేటలో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు మహంతి ధనుంజయ ఆధ్వర్యంలో అన్నదానం కొరకు 75కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండల జనసేన నాయకులు పెద్దపల్లి భాష, కర్రి భాష, చీమల సతీష్, బెల్లనా సాయి, చెల్లూరి చిన్న, రుద్రాక్షుల శ్రీను పాల్గొన్నారు.