నగరపంచాయతీ చైర్ పర్సన్ రాధా కుమారికి జనసేన వినతిపత్రం

పాలకొండ నియోజకవర్గం, పాలకొండలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది, సుమారు 150 కుక్కలు రోడ్డుపై తిరుగుతూ వాహనదారులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. రాత్రివేళలో వీధిలో తిరుగుతూ అరుస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. కావున వాటినుండి ప్రజలకు రక్షణ కలిగేలా తగు చర్యలు తీసుకోవాలని నగరపంచాయతీ చైర్ పర్సన్ రాధా కుమారికి తెలపడం జరిగింది. ఈ విషయంపై రాధా కుమారి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో ఈ సమస్యను సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ జనసేన పార్టీ నాయకులు పోరెడ్డి ప్రశాంత్, జనసేన జానీ, పొట్నూరు రమేష్, షేక్ అజాద్, జామి అనిల్, వారాడ సతీష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.