జగనన్న కాలనీలను సందర్శించి, ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తిన బండ్రెడ్డి

పెనమలూరు: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం, వణుకూరు గ్రామంలో ఆదివారం జగన్ కాలనీలను ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సందర్శించి, ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనమలూరు మండల అధ్యక్షులు కరిమికొండ సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి కాకాని లోకేష్, రావి సౌజన్య, ఉపాధ్యక్షులు వడ్డీ జీవ, జిల్లా కమిటీ సభ్యులు గంధం గోవర్ధన్, బండ్రెడ్డి రవి, చిమట రవి వర్మ, వి. శివ, జి. సురేష్, కృష్ణా రావు, కిరణ్, మేకా సుబ్బారావు, ఎన్. అంజిబాబు, ముంగి సుబ్బారావు, డి. ప్రవీణ్ నాయుడు, గోపరాజు వినయ్ కుమార్ మరియు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.