కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని కమీషనరుకి వినతిపత్రం అందజేసిన జనసేన

ఆకివీడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆకివీడు నగర పంచాయతీ కమిషనర్ కి కరోనా సమయంలో కాంట్రాక్ట్ క్రింద పనిచేసిన 8 మంది కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల 6 నెలల బకాయి జీతాలు 6లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని కమీషనరుకి ఆకివీడు మండల జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కోటికలపూడి తాతాజీ, కొట్టు నాగరాజు, భ్రమరాంభ, కారంపూడి సుమంత్, తుమ్మగంటి లక్ష్మణ్, నరహరశెట్టి బాబీ, విశ్వేశ్వరరావు, జిమ్ అనిల్, నాగసాయి, సాయి తదితరులు పాల్గొన్నారు