ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఖండిస్తూ జనసేన నిరసన

పెనుకొండ నియోజకవర్గం: పరిగి మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో పరిగి మండలంలోని ఆర్&బి స్థలంలో ఆక్రమణలను ప్రోత్సాహిస్తూ ఏర్పాటు చేసిన పెట్టెలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, మండల అధ్యక్షులు సురేష్, మాట్లాడుతూ.. మండల పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు ప్రొత్సహిస్తే సహించబోమని తెలిపారు. అక్రమంగా ఏర్పాటు చేసిన పెట్టెలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పంచాయితీకి నిధులు కావాలంటే పంచాయితీ నిధులు పక్కదారి మళ్లిస్తున్న ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు వెళ్ళి ధర్నా చేసి పంచాయితీ నిధులు తీసుకురావాలని ధ్వజమెత్తారు. ఎం.ఆర్.ఓ గారు స్పందించి వెంటనే పెట్టెలు తొలగించాలి, లేకపోతే జనసేన పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలియజేశారు. ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి జనసేన నాయకులను అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కార్యక్రమంలో మండల నాయకులు శివశంకర్, రామాంజి, సంజీవ, వేణు, శ్రీరాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.