నిఖిల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జనసేన నిరసన

సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలానికి చెందిన గిరిజన యువకుడు న్యాయశాస్త్ర విద్యార్థి ధరావత్ నిఖిల్ అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి మిస్సింగ్ అయి 11 వ తేదీ శవమై చిలుకూరు మండలం, కట్టకొమ్ముగూడెం వద్ద నాగార్జునసాగర్ కాలువలో శవమై తేలాడు. ఇప్పటి వరకు నిందితులను తట్టుకోకుండా చర్యలు తీసుకోకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా ఉన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని జనసేన పార్టీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణా విద్యార్ధి నాయకులు సంపత్ నాయక్ మాట్లాడుతూ నిఖిల్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని హామీ ఇచ్చారు. వెంటనే నిందితులని 24 గంటల్లోపు అరెస్ట్ చేయాలని చెప్పి వారు పోలీస్ అధికారులను మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు అందే శీను, చింతల నాగార్జున, ప్రధాన కార్యదర్శి కాంపల్లి వెంకట్, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పవన్ ఆల్వాల మరియు విద్యార్థి విభాగ కోఆర్డినేటర్ గోపీనాథ్ పటేల్, ఉమ్మడి నల్లగొండ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు రామగిరి శివ సాయి, ఉపాధ్యక్షులు పున్నం రాంబాబు, విద్యార్థి విభాగ కోఆర్డినేటర్ మనోజ్ జిల్లా నాయకులు చెరుకుపల్లి రామలింగం, గుడిసె గౌతమ్, శ్రీకాంత్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.