జర్నలిస్టు విఠల్ కుటుంబానికి అండగా యడ్లపల్లి రామ్ సుధీర్

  • పార్టీ తరఫున రూ. 20 వేల ఆర్ధిక సాయం
  • క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జర్నలిస్టు సోదరుడు తాత విఠల్ సతీమణి శ్రీమతి కుమారి

కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన జర్న్నలిస్ట్ సోదరుడు తాత విఠల్ సతీమణి శ్రీమతి కుమారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఆదివారం జింజేరు గ్రామంలోని విఠల్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి, జనసేన పార్టీ తరఫున రూ. 20 వేల ఆర్ధిక సాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా రామ్ సుధీర్ మాట్లాడుతూ జింజేరు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ సోదరుడు శ్రీ తాత విఠల్ గారి సతీమణి శ్రీమతి కుమారి గారు క్యాన్సర్ వ్యాధి సోకి తర్డ్ స్టేజ్ లో ఉంది.. ట్రీట్మెంట్ కోసం ఇప్పటికే చాలా ఖర్చు అయింది.. కావున రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరూ శ్రీ విఠల్ గారి కుటుంబానికి తమ వంతు సాయంగా ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని రామ్ సుధీర్ పిలుపునిచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా సమాచారం ఇవ్వాలని స్థానిక జనసేన శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గారావు, క్రోవి సుందర రాజు, కొలపల్లి శ్రీకాంత్, గడ్డిగోపుల నాగ, సింగంసెట్టి అశోక్ కుమార్, నందం శివ స్వామి, బాదం వినోద్, దారపు రెడ్డి నవీన్ అంజి బాబు, పవన్ పాల్గొన్నారు.