వైసీపీ అల్లరి మూకల చర్యలపై జనసేన నిరసన

బాపట్ల: నిజాంపట్నం మండలం, పుర్లమెరక గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని కొంత మంది వైసీపీ అల్లరి మూకలు జనసేన పార్టీ తరుపున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని చింపడం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే అందుబాటులో ఉన్న జనసేన నాయకులు మరియు జనసైనికులు అందరూ జరిగిన స్థలానికి వెల్లి ఇలా చెయ్యడం పిరికిపంద చర్య అని, రానున్న రోజుల్లో ఇలాంటి ఆటలు ఇంక సాగవు అని కోపంతో నిరసనను వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం మండల అధ్యక్షులు నరేష్ యాదవ్, ఉపాధ్యక్షులు అడుసుమల్లి పూర్ణచంద్ర రావు, ప్రధాన కార్యదర్శిలు పులివర్తి గోపి (సర్దార్), మిరియాల సుధాకర్, కార్యదర్శి రత్నబాబు, చిట్టిబాబు అనిల్, రాకేష్ మరియు జగదీష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.