వైభవోపేతంగా రాముల వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గరగలంపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల వారి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కన్నుల పండుగా జరిగిన స్వామి వారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ నియోజకవర్గంలో ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ స్వామి వారి చల్లని చూపులు ప్రతీ ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించానని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.