అనంతపురంలో ‘నా సేన కోసం… నా వంతు’

అనంతపురం, అనంతపురం నగరంలోని స్థానిక పాతూరులోని కస్తూరిబాయ్ స్కూల్ దగ్గర ఉన్న కాయగూరల మార్కెట్ సర్కిల్ లో జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు ‘నా సేన కోసం… నా వంతు’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు విజయ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర సంయుక్త కార్యదర్శి కేశవ, మరియు నాయకులు పవనిజం రాజు, శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. అలాగే కార్యక్రమంలో నగర ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనసేన పార్టీకి మద్దతు తెలపడం జరిగింది.