కేతనకొండ గ్రామంలో జనసేన రచ్చబండ
మైలవరం: ఇబ్రహీంపట్నం మండలం, కేతనకొండ గ్రామంలో జనసేన పార్టీ రచ్చబండ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా మైలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) గ్రామంలోని ప్రతి వీధికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తే తాము చేసే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసారు. జనసేన రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామ జనసేన కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెంపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, గ్రామ జనసేన పార్టీ నాయకులు కొమ్మూరు వెంకటస్వామి, కొమ్మూరి హనుమంతరావు, కాకాల అశోక్, ప్రవీణ్, బాల, ఆశిష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-30-at-3.08.27-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-30-at-3.08.28-PM.jpeg)