యాక్సిడెంట్ జరిగిన జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్. రాయవరం మండలం, భీమవరం గ్రామంలో జనసైనికుడు మడగల అప్పలరాజు కుమారుడు మడగల ప్రసాద్ శనివారం యాక్సిడెంట్ అవడంతో తనకి కాలు విరగడం, తన తల్లి నడుం ప్లాస్టర్ అవ్వడం జరిగింది. విషయం తెలుసుకొని జనసేన పార్టీ సీనియర్ నాయకులు జి సి ఆర్ ఫౌండేషన్ అధినేత గెడ్డం బుజ్జి వెంటనే వెళ్లి వాళ్ల పరిస్థితి ఏంటో తెలుసుకుని రమ్మని పంపడం జరిగింది. ఎస్. రాయవరం మండలం జనసైనికులుకు ఎల్.వి.ప్రసాద్, కొప్పిశెట్టి శంకర్రావు, దొరబాబు, కొప్పిశెట్టి పండు, వైజాగ్ కిమ్స్ హాస్పటల్ కి వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పి, మీకు జనసేన తరపున సహాయసహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పడం జరిగింది.