జనాధరణ నేత జనసేనాని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా నిర్వహించగల ధీశాలి పవన్ కళ్యాణ్: డాక్టర్ యుగంధర్

పాలసముద్రం మండలం కేంద్రంలో జనసేన పార్టీ మండల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలసముద్రం మండలానికి 22 మందితో నూతన కమిటీ నిర్మాణం తొందరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 13 గ్రామ పంచాయతీలోని గ్రామాలలో పర్యటించి 500 మంది క్రియాశీలక సభ్యులను గొప్ప నాయకులుగా తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. జనసైనికుల కోసం జనసేన కార్యక్రమం, ఆ తర్వాత జనం కోసం జనసేన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలే అజెండాగా, గ్రామ గ్రామాన గ్రామ కమిటీల ద్వారా పర్యవేక్షణ చేసి, బలమైన సంకల్పబలంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి మన్ననలు పొందే విధంగా సేవా కార్యక్రమాలు ఉంటుందని తెలిపారు. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు దిక్సూచి పవన్ కళ్యాణ్ మాత్రమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సతీష్ కుమార్, కార్వేటినగరం మండల గౌరవ అధ్యక్షులు భాను చందర్ రెడ్డి, అధ్యక్షులు భాను, నాయకులు రుద్ర, రాఘవ, అరుణ్, రాజేష్, మోహన్, తులసి, కుమార్, రామకృష్ణ, నిఫిల్ పాల్గొన్నారు.