జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్తున్న సాయిబాబా, దురియా

విశాఖ మన్యం అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం, టోకూరు పంచాయతీ పరిధిలో గల బోడు గూడా గ్రామంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించడం జరిగింది. ముందుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు గూర్చి గిరిజనులకు వివరించారు, గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వానికి తేడా అంటూ ఏమీ లేదని రెండు పార్టీలు కూడా గిరిజన బతుకులతో ఆడుకుంటున్నారని వీరికి బుద్ధి చెప్పే రోజులు వస్తాది అని మీరు అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. గిరిజనులకు ఉన్నటువంటి హక్కులను చట్టాలను పటిష్ఠంగా అమలు చేయక పోయి, గిరిజన చట్టాలు హక్కులకోసం పోరాడుతున్న ప్రజా సంఘ నాయకులను ముందస్తు అరెస్టులో ఉద్యమాలను అణిచివేసే ధోరణి వైయస్సార్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అరెస్టులతో ధర్మాలు ఆపలేరని ప్రజా అవసరాల రీత్యా ఉపయోగపడే ఉద్యమాలకు కులాలకు అతీతంగా మతాలకతీతంగా ప్రజాసంఘాల కతీతంగా గిరిజనుల అందరూ కలిసి రావలని పిలుపునిచ్చారు. దీనికి ముందుగాను జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు అజయ్, చంటి తదితరులు పాల్గొన్నారు.