క్యాన్సర్ బాధితునికి జనసేన సేవా సమితి ఆర్ధికసాయం

కంచిలి మండలం, శ్రీరాంపురం గ్రామానికి చెందిన లండ భూసయ్య కుమారుడు యోగేంధర్ (చిన్నారి) క్యాన్సర్ వ్యాధి బారిన పడడంతో శుక్రవారం జనసేన సేవా సమితి ఆధ్వర్యంలో అతని కుటుంబాన్ని కలిసి వారికి తోడుగా జనసేన సేవా సమితి ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, వారికి గ్రామ పెద్దలు మాదిన రాజేశ్వర్ రావు చేతుల మీదుగా 13,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సేవా సమితి సభ్యులు మరియు కొర్లం రవి, కూర్మారావు(అంపురం), ప్రదీప్ బార్ల, సంతోష్, కార్తీక్ శివతేజ, మాదిన వినయ్, శ్రీను మరియు గ్రామ యువత పలువురు పాల్గొన్నారు.