మార్కాపురం జిల్లా సాధనకై జనసేన సంఘీభావం

మార్కాపురం ఆర్.డి.ఓ కార్యాలయం వద్ద మార్కాపురం జిల్లా సాధన సమితి (జే.ఏ.సీ) ఆధ్వర్యంలో మార్కాపురం కార్పెంటర్ అసోసియేషన్ వారు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మరియు మార్కాపురం జిల్లా సాధన సమితి జే.ఏ.సి వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాధ్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఇమ్మడి కాశీనాధ్ నూతనంగా ఎన్నికైన కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి ఛైర్మన్ కందుల నారాయణరెడ్డి, జిల్లా సాధన సమితి కన్వీనర్ సైదా, జిల్లా సాధన సమితి ట్రెజరర్ వక్కలగడ్డ మల్లికార్జున, సిపిఐ, సీ.పీ.ఎం నాయకులు అందె నాసరయ్య, సోమయ్య, రవి, టీడీపీ నాయకులు తళ్లపల్లి సత్యనారాయణ, డా.మౌలాలి, జనసేనపార్టీ ప్రకాశంజిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం పట్టణ అద్యక్షుడు షేక్ ఇమామ్ సాహెబ్, మండల అధ్యక్షులు తాటి రమేష్, వీరిశెట్టి శ్రీనివాసులు, బిసా హరీష్, ఊటుకురి వెంకటేశ్వర్లు మరియు జనసేన మరియు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.