పారిశుద్ధ కార్మికులకు అండగా జనసేన

ఆమదాలవలస, రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుల జీతాలు తగ్గింపు, బకాయిల చెల్లింపులు మరియు వారిపట్ల ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమదాలవలస మున్సిపాలిటీలో కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్ధతుగా దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తించిన కార్మికుల జీతభత్యాల బకాయిలు చెల్లించకపోవడంతో పాటు వారి జీతాలలో కోతలు విధించటం అధికార పార్టీ దాష్టికానికి అద్దం పడుతుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం వీరి బకాయిలు చెల్లించి జీతాలు పెంచి సమ్మెను విరమింపచేయాలనీ కోరారు. లేని పక్షంలో కార్మికుల సమస్యలను అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.