కోలా శ్రీనుకి అండగా జనసేన

  • రూపాయలు 15000/- ఆర్ధిక సాయమందించిన లోకం మాధవి

నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలంలో గొల్లపేటకు చెందిన జనసైనికుడు కోలా శ్రీను యాక్సిడెంట్ లో కాలును కోల్పోవడం జరీగింది. కోలా శ్రీను ని జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి పరామర్శించారు. కోలా శ్రీనుకి 15000/- రూపాయలు చెక్ ను అందించి వారి ఇంట్లో వాళ్లకి మనోధైర్యం చెప్పడం జరిగినది. శ్రీనుకి ప్లాస్టిక్ కాళ్లు పెట్టిస్తామని, శ్రీను కోలుకున్న తరువాత జీవన ఆధారం కలిపిస్తాను ఆని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు గుడివాడ జమరాజు, వందనాల రమణ, బోర సతీష్, కర్రెప్పలరాజు టంకల్ రామోజీరావు, కే నర్సింగరావు గొల్లపేట గ్రామం చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.