మోటార్ కార్మిక సోదరులకు అండగా జనసేన

తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో మంగళవారం మోటార్ కార్మిక సోదరులకు అండగా జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ డ్రైవర్లకి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి డిమాండ్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసారు. డ్రైవర్లకు వైద్య భరోసా, విద్య భరోసా, భద్రత భరోసా మరియు శ్రమకి తగిన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని డా.హరిప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ ఇంచార్జి కిరణ్ రాయల్, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, తిరుపతి ఉపాధ్యక్షులు పార్ధు, ఆకుల వనజ, జిల్లా కార్యదర్శి ఆనంద్, సీనియర్ నాయకులు కృష్ణయ్య, తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.