ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న డా. వెంకటలక్ష్మి

యానాం: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి రాష్ట్రంలోని, యానాం నియోజక వర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 3 సార్లు పుదుచ్చేరి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, 3 సార్లు ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డ్ స్వీకరించి, ప్రస్తుతం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆయన ఆహ్వానం మేరకు విశిష్ట అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా. ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు.