పాలించే ప్రభుత్వాలు పేదరికాన్ని గాలికి వదిలేసినా.. గాలించి ఆర్థిక సహాయం అందించిన జనసేన..!!

పిఠాపురం మండలం గోవిందరాజపురం గ్రామంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి భరోసాగా బాలింతరాలు భవాని కి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు అందరూ కలిసి
9500/- రూపాయలు 75 కే.జి ల బియ్యం బస్తాలను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో.. ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, పుణ్యవంతుల మూర్తి, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి, మాజీ కౌన్సిలర్ కర్రీ కాశీ విశ్వనాథ్, మేళం బాబి, కంద సోమరాజు, నామ శ్రీకాంత్, తేజ, సింహాద్రి, బి శ్రీనివాస్, సి.హెచ్ అప్పలరాజు, బి.ఆనంద్, గ్రామస్తులు, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.