ప్రమాదవశాత్తు నివాసం కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచిన జనసేన

కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో ప్రమాదవశాత్తు నివాసం కోల్పోయిన కుటుంబాన్ని ఈడుపుగల్లు జనసైనికుడు గంధం అనిల్ ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు పెనమలూరు నియోజకవర్గ నాయకులు పులి కామేశ్వరరావు పరామర్శించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కోన జనార్దన్ కంకిపాడు మండల అధ్యక్షులు ముప్పా రాజా, బోయిన నాగరాజు, ముప్పిరి ఆర్.కె.నాయుడు, సుంకర శివ, వీర మహిళలు కొఠారి లావణ్య, సునీత పాల్గొని జనసేన పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అని భోరోసా ఇచ్చారు.