అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

పార్వతీపురం నియోజకవర్గం: నర్సిపురం గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాద బాధితులను మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు సమక్షంలో మండల అధ్యక్షురాలు ఆగురు మణి ఆధ్వర్యంలో మాచర్ల శ్రీరామ్, నీ అలాగే మాచర్ల రాజేశ్వరిని పరామర్శించడం జరిగింది. అలాగే వారికి ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు వారికి భరోసాని ఇచ్చారు. వాళ్లు ధైర్యాన్ని నింపారు. వాళ్లకి నెలకు సరిపడిన నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మానవతా దృక్పథంతో ముందుకు వెళ్దామని చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన జనసేన పార్టీ ఉందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్, ఖాతా విశ్వేశ్వరరావు, గుండ్రెడ్డి గౌరీ శంకర్, కర్రీ మణికంఠ, పోతుల శివశంకర, ఆగూరు శ్రీను, పాత్ర పవన్, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, అంబటి బలరాం, తాన చిన్నమనాయుడు, పైళ్ల అప్పలరాజు, సిద్ధాంతపు గణేష్, యోగి రెడ్డి ప్రసాద్, సాయి, శేఖర్, పాండ్రికి మనోజ్, అనిల్, వికాస్, అశోక్, మహేష్, బండపల్లి చంద్ర, జనసైనికులు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.