అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

  • అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం
  • 3లక్షల వరకు ఆస్తి నష్టం
  • కుటుంబానికి అండగా జనసేన నాయకులు మరియు స్థానిక ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్

ఆముదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొల్ల లింగం నాయుడు పూరిల్లు దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 3లక్షల ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కొల్ల జయరాం మరియు స్థానిక ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితులకు అండగా మరియు ఆర్ధికంగా జనసేన ఉంటుందని భరోసా ఇచ్చి, ప్రభుత్వ అధికారులు కూడా తక్షణ సాయం చెయ్యాలి అని జనసేన తరఫున డిమాండ్ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిల్లాన నరేష్, తులగాపు మౌళి, రుద్ర దీప్, సాయి, కిరణ్ గ్రామ జనసేన నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.