బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటి కేశవరం గ్రామానికి చెందిన అడ్లబోయిన సుబ్రహ్మణ్యం కొన్ని రోజుల క్రితం చిన్న వయస్సులోనే గుండెపోటుతో చనిపోయారు. ఈ వార్త అక్కడి జనశ్రేణులు ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించి, వారిని ఓదార్చి జనసేన పార్టీ తరుపున 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమం కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, చల్లా ప్రసాద్, మండపాక మురళి, కోటికేశవరం జనసైనికులు హరీ, డి.ఎమ్.రాజు, ఎన్. రాజ్ కుమార్, బి. కృప, ఎన్. విజయ్, పి. ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.