ప్రమాదవశాత్తు గాయపడ్డ జనసైనికునికి జనసేన అండ

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, కోకనారాయణ పాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు తటవర్తి కోటేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు మంగళవారం కోటేశ్వరరావు (కోటప్ప)కు పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ సహకారంతో నిత్యావసర సరుకుల నిమిత్తం ఆర్థికసాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు మండలం జనసేన అధ్యక్షుడు దాసరి ఉమా సాయి రామ్, జనసేన నాయకులు దివి శ్రీనివాస్, చోడగం నాంచారయ్య, యర్రంశెట్టి జ్వాలా, దారపురెడ్డి నవీన్, నందం శివ స్వామి, మద్దాల పవన్ స్ధానిక జనసైనికులు పాల్గొన్నారు.