కోట సురేష్ కుటుంబానికి అండగా జనసేన

గోపాలపురం: దేవరపల్లి గ్రామంలో ఇటీవల జనసేన కార్యకర్త కోట సురేష్ రోడ్ యాక్సిడెంట్లో స్వర్గస్థులు అయినారు. దేవరపల్లి జనసేన పార్టీ తరుపున ఆయన కుటుంబాన్ని పరామర్శించి 25,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గోపాలపురం జనసేన పార్టీ ఇంఛార్జి సువర్ణ రాజు, అనిశెట్టి గంగరాజు, కంబాల సత్తిబాబు, సూరిసెట్టీ బాలు, జాజిమోగ్గల శ్రీనివాస్ (జెకె), అడబాల మణికంఠ, నిజంపుడి నాగరాజు, తంగెళ్ళ గంగాధరం, మాటురి నాని, కవల వెంకన్న మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.