గుడివాడ శ్రీనివాసరావు కుటుంబానికి అండగా నిలచిన జనసేన

విశాఖ తూర్పు నియోజకవర్గం: 15వ వార్డ్ ఓల్డ్ వెంకోజీ పాలెం ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న గుడివాడ శ్రీనివాసరావు ఆరోగ్యం బాగోక రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం బాధాకరం. శ్రీనివాసరావు బార్య వరలక్ష్మి పుట్టుకతో దివ్యాంగురాలు. శ్రీనివాసరావు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు పాప టెన్త్ క్లాస్, బాబు సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు. ఏమి చేసుకోలేని పరిస్థితిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శ్రీ వరలక్ష్మి గారు ఒక విన్నపం పంపించడం జరిగింది. ఆ విన్నపం సుమన్ టీవీ ద్వారా వారి ఛానల్ లో ఆ వీడియో వేయడం జరిగింది. ఆ వీడియో చూసి స్పందించిన విశాఖ జనసేన పార్టీ టాక్సీ డ్రైవర్ల సంఘం వారితరఫున 45000 రూపాయలు, ఐదు నెలలకి సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు పోగుచేసి జనసేన పార్టీ విశాఖ తూర్పు 15వ వార్డు నాయకులు శ్రీ పచ్చతాల సాయిబాబా గారికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆయన వంతుగా 6000 రూపాయలు ఆ కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. దివ్యాంగురాలు అయిన వరలక్ష్మి గారికి మూడు చక్రాల బండిని బాగు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.