శ్రీకృష్ణపట్నం గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు’

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి దంపతులకు శ్రీకృష్ణపట్న ప్రజానికం ఘనస్వాగతం పలికారు.

ప్రజాక్షేమం కోసం పాటుపడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపే కార్యక్రమమే నా సేన కోసం నా వంతు కార్యక్రమం అని కిమిడి శ్రీరాం అన్నారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రజలకోసం పాటుపడుతున్న పార్టీ జనసేన అని ఘంటాపథంగా తెలియజేసారు. చదువుకున్న యువత, విజ్ఞులు రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన పార్టీకీ మద్దతుగా నిలవాలని తెలియజేసారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మహత్కార్యాన్ని తలపెట్టిన పవన్ కళ్యాణ్ కి మన వంతుగా సహకారం అందించే మార్గమే ఈ నా సేన కోసం నా వంతు కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.

రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సభను అలంకరించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జనసైనికులకు అభివాదం చేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. బత్తుల మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఏ పార్టీ ప్రజాక్షేమాన్ని కోరుతుందో ఎక్కడ చేరితే ప్రజా సమస్యలు తీర్చేవాడిని అవుతానో అనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు కనిపించింది కేవలం జనసేన మాత్రమేనని, నేను పార్టీలోకి రావడానికి కారణమైన జనసైనికులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు. దోచుకోవడం, దాచుకోవడం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కేవలం జనసేనతోనే సాధ్యమని వివరించారు. గాలి, నీరు, వాతావరణాన్ని కలుషితం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా జనసేనకు మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ ఇస్తానన్న ఉచిత గృహాల నిర్మాణం ఆదిలోనే అంతమైపోయిందని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. రైతుల సబ్సిడీలు తొలగించి పంటపొలాల్లోని మోటార్లకు ఛార్జీలు విధించి రైతులని అవమానిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశ ధాన్యాగారం ఉండే ఆంధ్రప్రదేశ్లో రైతన్నకు అండ లేకుండా పోవడం అధికార పార్టీ సిగ్గుపడాల్సిన విషయం అని బత్తుల ధ్వజమెత్తారు. నష్టపోతున్న రైతులకి అండగా జనసేన నిలబడుతుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని అర్ధారోగ్య పధకంగా మారుస్తున్న తీరుని తప్పుపట్టారు. పేదలకు ఎలా మెరుగైన వైద్యం అందుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాపునే‌స్తం ఊసేలేదు, ఉచిత పధకాల మాటేలేదు, చెప్పినవి నవరత్నాలు పెట్టినది పంగనామాలు అని ఎద్దేవా చేశారు. తండ్రిని చూసి తనయుడికి ఓటు వేస్తే తనయుడు యముడై రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నాడని బత్తుల పేర్కొన్నారు. అర్హత ఉన్నా చెయ్యడానికి ఉద్యోగాలు లేవని ఉపాధి అవకాశాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉద్యోగాల ఊసు ఎత్తితే వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగాలు తప్ప ఇంక ఎటువంటి మాటలేదని నిరుద్యోగుల కోసం జనసేన పోరాడుతుందని తెలియజేశారు. రాజధాని లేని రాష్ట్రంలో రాజన్న రాజ్యం ఎలా తెస్తారు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, రైతులు ఆనందంగా ఉండాలన్నా జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని ఆ మార్పు ఇక్కడినుంచే మొదలవ్వాలని విజ్ఞప్తి చేశారు. జనసేనలో ఒకే కులం, ఒకే మతం, ఒకే వర్గం ఉంటాయని, నియోజకవర్గంలో ఉన్న అసమానతలను తొందర్లోనే తొలగిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాణం పోయే వరకూ జనసైనికులకు, వీరమహిళలకు అండగానే ఉంటానని మరొక్కసారి గుర్తు చేశారు. నా సేన కోసం నావంతు అనే కార్యక్రమానికి మీరు అందించే సహకారం అయోధ్య రామ మందిరానికి మనమిచ్చిన విరాళమంత గొప్పదని వెల్లడించారు. తొందర్లోనే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న అంబులెన్స్ సేవల గురించి శ్రీ కృష్ణపట్నం నా సేన కోసం నావంతు కార్యక్రమంలో వివరించి మరికొద్ది రోజుల్లో ఆ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాసేన నావంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ప్రసంగిస్తూ.. పవన్ కళ్యాణ్ తలపెట్టిన నా సేన కోసం నా వంతు కార్యక్రమం ఇంత బ్రహ్మాండగా జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జనసైనికులు ఎప్పుడూ ఒకరికి ఇచ్చే స్ధాయిలో ఉంటారే కాని ఒకరి దగ్గర ఆశించే స్ధాయిలో ఉండరని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడే పార్టీ కోసం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.