ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలచిన జనసేన

ఆమదాలవలస నియోజకవర్గం: పూజారిపేటలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన, పెద్ద దిక్కు మునకాల ప్రభాకర్ రావు ఇటీవల ఆకస్మాత్తుగా చనిపోయారు. ఆ కుటుంబం 8 సంవత్సరాల చిన్న పాపతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారని విషయం తెలుసుకునీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకారంతో 20,000 రూపాయలను మన పార్టీ నాయుకులు పాత్రుని పాపారావు మాస్టర్, మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ అంపిలి విక్రమ్, అంబలా కొటేష్, సురేష్, తేజేశ్వర్రావు, అనూషకుమార్, సేపెన రమేష్, బాలకృష్ణ, చందు మనోహర్, వెంకిబాబు, రాము చేతులు మీదగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరియు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా జనసేన పార్టీ ఉంటుందని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపేరునా జనసేన పార్టీ తరఫున మరియు ఆ కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.