యడమ రాజేష్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

పటాన్ చెరువు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళే విధంగా జనసేన పార్టీ పటాన్ చెరువు ఇంచార్జ్ యడమ రాజేష్ నాయకత్వంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పటాన్ చెరువు నియోజకవర్గంలోని బీరంగూడ కమాన్ నుండి కృష్ణారెడ్డిపేట వరకు పాదయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ రాజేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అవినీతి రాజకీయ నాయకులను గద్దె దించే ప్రక్రియలో జనసేన ప్రజలకు అండగా ఉంటుందని భ్రష్టు పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేస్తూ నూతన రాజకీయ వ్యవస్థను స్థాపించి ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ ముందుంటుంది అని తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ప్రజలకు చేరువలో జనసేన ఉంటుందని ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు మెగా అభిమానులు భారీగా పాల్గొన్నారు.