కిష్టంపేట గ్రామ సర్పంచ్ కి వినతిపత్రం ఇచ్చిన జనసేన

బెల్లంపల్లి, గత 15 సంవత్సరాల నుంచి ఎస్టి కాలని రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పిన అధికారులు స్పందించడం లేదు, దయచేసి తొందరగా రోడ్డు నిర్మాణం చేయాలని కోరుకుంటున్నామని. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కిష్టంపేట గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. గిరిజన ప్రాంతంలో ఇంత వరకు రోడ్లు, కాలువలు, నిర్మించ లేదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త, ట్రాక్టరు కూడా రాకపోవడం వల్ల చేత్త గ్రామాల్లో పెరుకుపోతుంది. వాటర్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా గ్రామ సమస్యలు గుర్తించి తొందరగా పరిష్కరించాలని కిష్టంపేట సర్పంచ్ మరియు గ్రామపంచాయతీ సెక్రటరీకి జనసేన పార్టీ యువనాయకులు సదాల కార్తీక్, శనిగారపు దుర్గాప్రసాద్, మీనుగు తిరుపతి, ఉరేడి వెంకటేష్, గుమ్ముల వినీత్, ఉరడి ప్రశాంత్, టేకం అంజి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.