మున్సిపల్ కార్మికుల పోరాటానికి జనసేన మద్దతు

కొత్తగూడెం నియోజకవర్గం: పాల్వంచ మండలంలో మున్సిపల్ కార్మికుల (స్వచ్ఛ కార్మికులు) సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ, నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు వారికి సోమవారం మద్దతు తెలియచేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి న్యాయం జరగపోతే జనసేన పార్టీ తరుపున వారు చేసే ధర్మ పోరాటానికి పూర్తి మద్దతు తెలియచేసి ఉద్యమం మరింత బలంగా చేస్తాం అని తెలియచేయడం జరిగింది. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్ల కొరకు 24 గంటల దీక్ష చేస్తున్న సయ్యద్ రషీద్ మరియు ఉబ్బని శ్రీను లకు మిగిలిన ఉద్యమకారులకు సోమవారం కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున మద్దతు తెలియజేసిన కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్ మరియు కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా మరియు కొత్తగూడెం టౌన్ జనరల్ సెక్రటరీ మారెల్లి విజయ్ కుమార్ పాల్వంచ మండలం జనరల్ సెక్రటరీ దేవా గౌడ్, వైస్ ప్రెసిడెంట్ సంపత్, నియోజకవర్గ ముఖ్య నాయకులు మార్గం సందీప్, సాయివినీత్ అనిత్, బాషా, పండు, తదితరులు పాల్గొని వారికి మద్దతు తెలియచేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు చేసే పోరాటానికి కూడా జనసైనికులు వారికి ప్రతి నియోజకవర్గంలో అండగా ఉంటారు అని తెలియచేయడం జరిగింది.