పోలవరంలో అంగన్వాడీల సమ్మెకు జనసేన మద్దతు

పోలవరం: గత 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేపట్టిన నిరావధిక సమ్మెలో నేడు జంగారెడ్డిగూడెంలోజిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు, చింతలపూడి నియోజకవర్గం ఇంచార్జి మేకా ఈశ్వరయ్య పాల్గొన్నారు. అంగన్వాడీలు కోరుకునే 26 వేల రూపాయల కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాటిట్యూడ్ అమల్లోకి తీసుకురావడం, రిటర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనాలు సగం పింఛన్ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లో గుర్తించడం లబ్ధిదారులకు సరైన సరుకులు అందించడం తదితర డిమాండ్లు వెంటనే ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు. తమకు మద్దతుగా నిలిచినటువంటి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకా ఈశ్వరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగ క్రిష్ణ ఏడు మండలాల అధ్యక్షులకు, మండల కమిటీ సభ్యులకు, జనసేన నాయకులకు కార్యకర్తలకు సిఐటియు యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.