జనసేన యువత ఆత్మీయ సమావేశం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: టిడిపి క్యాంప్ ఆఫీస్ ప్రజావేదికలో జనసేన, టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరితో కళ్యాణదుర్గం జనసేన ముఖ్య నాయకులు రాజు ఆధ్వర్యంలో జనసేన యూత్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 120 మంది కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని జనసేన యువకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ & జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి కొరత, నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు, రోడ్లు సమస్య, నిరక్షరాస్యత, మొదలైన సమస్యలు గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన వీరమహిళల ఇంచార్జులు షేక్ తార, మమత, కల్పన, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, శెట్టూరు మండల అధ్యక్షులు కాంతరాజు, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, కంబదూరు మండల పాధ్యక్షులు వెంకటేష్, కళ్యాణదుర్గం నాయకులు సయ్యద్, అనిల్ పాల్యం, సుధాకర్, చిత్తప్ప, నియోజకవర్గ మీడియా ఇంచార్జ్ రాయుడు పాల్గొన్నారు.