బీజేపీ అభ్యర్థి కందుల సంధ్య రాణికి జనసేన మద్దతు

  • రామగుండం నియోజకవర్గ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల సంధ్య రాణికి మద్దతు తెలిపిన జనసేన నాయకులు

తెలంగాణ, రామగుండం నియోజకవర్గం: బీజేపీ అభ్యర్థి కందుల సంధ్య రాణి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల మధు మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్న మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ అన్న సూచనలతో రామగుండం నియోజకవర్గం జనసైనికుల తరఫున బీజేపీ పార్టీ అభ్యర్థి కందుల సంధ్య రాణికి మద్దతు తెలుపుతూ పొత్తు ధర్మం పాటించాల్సిందిగా కోరడం జరిగింది. నియోజకవర్గం భవిష్యత్ కార్యాచరణ పై జనసేన ఎలక్షన్ కమిటీ సభ్యులతో కలిసి చర్చించిన అనంతరం ఉమ్మడి కార్యాచరణతో నియోజకవర్గంలో బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కందుల సంధ్యా రాణి గెలుపు కోసం కృషి చేస్తాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మంథని శ్రవణ్, ఏముర్ల రంజిత్, రాజశేఖర్, రవికాంత్, పవన్ కళ్యాణ్, మంథని మధు, తిప్పరపు సురేష్, శశాంక్, ప్రవీణ్, మనోజ్, సంతోష్, సాయి, అజయ్, రాము మరియు జనసైనికులు పాల్గొన్నారు.