కొండపల్లి మున్సిపాలిటీలో టిడిపి రిలే దీక్షకు జనసేన మద్దతు

మైలవరం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం మైలవరం నియోజకవర్గం, కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు టీడీపీ నాయకులు గత 3 రోజులు నుండి చేపట్టిన రిలే నిరాహారదీక్షకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మరియు కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు వెంకీ, చిదరాల సురేష్, తాటి శ్రీను, అడవికోరి నాగరాజు, జీలని, కళ్యాణ్ బాబు, పాల్గొని మద్దతు పలికారు.