గోరంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు చేస్తున్న వి.ఆర్.ఏ ల నిరసన దీక్షకు జనసేన మద్దతు

పెనుకొండ, రాష్ట్ర వ్యాప్తంగా 12వ రోజు జరుగుతున్న వి.ఆర్.ఏ ల నిరసన దీక్షలలో శనివారం గోరంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. వి.ఆర్.ఏ ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వి.ఆర్.ఏ లకు ప్రభుత్వం కనీస వేతనం 21000/-తక్షణమే ఇవ్వాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది వి.ఆర్.ఏ లకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, పెనుకొండ నియోజకవర్గ నాయకులు అనిల్, గోరంట్ల నాయకులు వెంకటేష్, నాగేంద్ర, రాఘవ, గుంటిపల్లి తిరుపాల్, సర్దార్, గౌతమ్, హరి తదితరులు పాల్గొన్నారు.