కళ్యాణదుర్గంలో జనసేన-టిడిపి ఇంటింటి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: కళ్యాణదుర్గం పట్టణం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా కళ్యాణదుర్గం పట్టణంలోని విద్యనగర్ కాలనీలో అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి జనసేన-టిడిపి ఉమ్మడిగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన-టిడిపి రెండు పార్టీల ఆధ్వర్యంలో మేనిఫెస్టో అంశాలను, హామీలను ఇంటింటికి వివరించడం జరిగింది. ఈ ఉమ్మడి ప్రచార కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున ముఖ్య అతిథులు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య హాజరవగా, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, జనసేన వీరమహిళల ఇంచార్జులు షేక్ తార, మమత, కల్పన, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, కళ్యాణదుర్గం మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, కళ్యాణదుర్గం మండల ప్రధాన కార్యదర్శులు శ్రీహర్ష, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు రాజు, రుహుల్ల, సుధాకర్, చిత్తప్ప, కళ్యాణదుర్గం నియోజకవర్గం మీడియా ఇంచార్జ్ రాయుడు, తదితరులు పాల్గొన్నారు.